ఘన విజయం.. ఫైనల్స్‌ చేరిన టీమిండియా

by సూర్య | Fri, Jan 27, 2023, 04:36 PM

అండర్‌-19 ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.2 ఓవర్లలోనే 110 పరుగులు చేసి విజయం సాధించింది. టీమిండియా ప్లేయర్ శ్వేతా సెహ్రావత్‌ (61) అర్ధ సెంచరీతో రాణించారు. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ జనవరి 29న జరుగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్‌లో గెలిచిన వారితో భారత్‌ తలపడుతుంది.

Latest News

 
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు Sun, Apr 28, 2024, 10:19 AM
వైసీపీ మేనిఫేస్టో తుస్సుమంది: గంటా Sun, Apr 28, 2024, 10:14 AM
ఇలా చేస్తే మహిళల ఖాతాలో రూ.లక్ష Sun, Apr 28, 2024, 09:56 AM
రానున్న 5 రోజులు ముప్పు.. జాగ్రత్త: IMD Sun, Apr 28, 2024, 09:54 AM