వైభ‌వంగా శార‌దాపీఠం వార్షికోత్స‌వాలు

by సూర్య | Fri, Jan 27, 2023, 03:52 PM

విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపా నందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి మహో స్వాములు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలతో వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తొలుత గణపతి పూజ అనంతరం రాజ శ్యామల అమ్మవారికి. వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠం ప్రాంగణంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి యాగశాలను ప్రారంభించారు. వార్షికోత్సవానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి స్వరూపానంద అనుగ్రహభాషణము చేశారు. లోకంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అందుకు ఆ శారదా అమ్మవారు నిరంతరం అనుగ్రహం అందించాలని కోరుకున్నామన్నారు. రాజ శ్యామల అమ్మవారు గొప్ప మహిమాన్వితురాలని కొనియాడారు. గొప్ప ఉపాసన మంత్రం తో అమ్మవారు యాగం జరుగుతుందన్నారు. వేరే ఎక్కడా ఈ తరహో లో జరగవన్నారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM