స్వతంత్రం కోసం కృషి చేసిన నాయకులను స్మరించుకుందాం

by సూర్య | Fri, Jan 27, 2023, 02:25 PM

బ్రహ్మంగారిమఠం మండల కార్యాలయాల సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గురువారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మండల మహిళా సమైక్య ఏపిఎం గొల్లపల్లె ప్రకాష్ రావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు కొడవటి కంటి చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భారతదేశం నేడు 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుందని, ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్రం కోసం కృషి చేసిన నాయకులను ప్రతి భారతీయుడు గౌరవించడం, గుర్తుతెచ్చుకొని స్మరించడం చేయాలన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా బడుగు, బలహీన వర్గాల నిమ్న జాతి వారికి అందించిన ఫలాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీ సభ్యులు రవిబాబు, పిటర్, ఓబులేసు, వెలుగు సిబ్బంది దానియేలు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM