20రోజుల్లో పెళ్లి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by సూర్య | Fri, Jan 27, 2023, 02:24 PM

20రోజుల్లో పెళ్లి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో అరుణ్‌ పాండు(23) అనే యువకుడు  మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే... కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం గుడికల్‌ గ్రామానిక చెందిన మహేంద్ర, రేణుకలకు ఇద్దరు కుమారులు. వీరిలో అరుణ్‌ పాండు కర్ణాటకలోని సిరిగుప్పలో ఓ ఫెర్టిలైజర్‌ దుకాణంలో పని చేస్తున్నాడు. నాలుగు రోజుల కింద ఎస్సై పరీక్షలు రాశారు. గురువారం ఫర్టిలైజర్‌ దుకాణం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఆదోనికి వచ్చాడు. పనులు ముగించుకొని రాత్రి 10గంటల సమయంలో సిరిగుప్పకు వెళ్తుండగా సంతేకూళూరు సమీపంలోని ఇటిక్యాల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అరుణ్‌కు తల పగిలి రక్తపుమడుగులో మృతి చెందాడు. 20రోజుల్లో పెళ్లి.. ఉండగా ఇలా జరిగిందని తల్లి కన్నీరు మున్నీరు అయింది. ఇస్వి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM