జీవో1ని రద్దు చేసే వరకు పోరాడతామని ప్రతిజ్ఞ

by సూర్య | Fri, Jan 27, 2023, 01:54 PM

ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసం ఘాల హక్కులను కాలరాసే విధంగా ఏకపక్షంగా తీసుకొచ్చిన నల్ల జీవో 1ని వెంటనే రద్దు చేయాలని కడప జిల్లా, బి.కొత్తకోట సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ నారాయణస్వామిరెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక జ్యోతి చౌక్‌ నందు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ, సీపీఐ, బాస్‌ ఏఐటీయూసీ తదితర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు చేరుకుని జీవో1ని రద్దు చేసే వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీపీ ఐ సీనియర్‌ నేత బషీర్‌ఖాన, బాస్‌ నేత సచిన, ఏఐ టీయూసీ నేత ఎస్‌.సలీంబాషా, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి మస్తాన పాల్గొన్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM