by సూర్య | Fri, Jan 27, 2023, 01:53 PM
శ్రీకాకుళం జిల్లా, అరసవల్లి ఆదిత్యుడి రథసప్తమి వేడుకలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సూర్యభగవానుడికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులకు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అధికారులు శుక్రవారం రాత్రి 8 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
Latest News