by సూర్య | Fri, Jan 27, 2023, 01:03 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద గల గణేష్ ఆలయంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మనాయుడు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, మైధిలి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Latest News