ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు

by సూర్య | Fri, Jan 27, 2023, 12:59 PM

ఆంధ్ర ఒడిశా బోర్డర్ దుర్గాపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన కురుపాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అందించిన వైద్యులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తవలస గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. దుర్గాపాడులో పూజ నిమిత్తం వెళ్ళి పూజ ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM