by సూర్య | Fri, Jan 27, 2023, 01:23 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. ఆయనను వెంటనే చికిత్స కోసం కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించారు. మసీదులో లోకేష్ తో కలిసి ప్రార్థనలు చేసి బయటకు వచ్చే సమయంలో ఈ ఘటన జరిగింది.
Latest News