అనారోగ్యం తో టీడీపీ నాయకుడు మృతి

by సూర్య | Wed, Jan 25, 2023, 03:22 PM

ప్రకాశం జిల్లా, టీడీపీ సింగరాయకొండ మండల మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నాయకుడు చీమకుర్తి వెంకటేశ్వర్లు (60) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన మూలగుంటపాడులో తన స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వామి, దామచర్ల పూర్ణ చంద్రరావు మూలగుంటపాడు వచ్చి వెంకటేశ్వర్లు పార్ధివదేహాన్ని సంద ర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణి అయిన మాజీ ఎంపీపీ రమణమ్మ, కుమారులు శ్రీకాంత్‌, కృష్ణను కలసి ఓదార్చారు. టీడీపీ సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల అధ్యక్షులు వేల్పుల సింగయ్య, పోకూరి రవీంద్ర, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి రామయ్య, టీడీపీ నేతలు షేక్‌ సంధానిబాషా, రాచగర్ల వెంకట్రావు, నారాయణ స్వామి, పోటు పెదబాబు, కూనపురెడ్డి సుబ్బారావు, మందలపు గాంధీ చౌదరి, ఇమ్మిడిశెట్టి రామారావు, మించల బ్రహ్మయ్య, వేల్పుల వెంక ట్రావు, చంటి, షేక్‌ అజీం, అబ్దుల్‌ సుభానీ, నియోజకవర్గంలో పలువురు టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని సందర్శించిన నివాళులర్పిం చారు. సాయంత్రం నిర్వహించిన అంతిమయాత్రలో ఎమ్మెల్యే స్వామి పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు టీడీపీలో సాధారణ కార్యకర్త నుంచి అంచెలం చెలుగా ఎదిగారు. దాదాపు 20 ఏళ్లపాటు పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2001 నుంచి 2006 వరకూ ఆయన సతీమణి రమణమ్మ ఎంపీపీగా పనిచేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM