ఏస్వేచగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

by సూర్య | Wed, Jan 25, 2023, 03:16 PM

నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెంలోని కనిగిరి రిజర్వాయర్‌ కరకట్టలను గ్రావె ల్‌ మాఫియా నుంచి కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపి సీనియర్‌ అసిస్టెంట్‌ కొండలరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నమామిగంగే రాష్ట్ర ప్రముఖ్‌ మిడతల రమేష్‌ మాట్లాడుతూ...  అధికార పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం గ్రావెల్‌ అక్రమ తవ్వకాలతో రిజర్వాయర్‌ కరకట్టలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ లేఔట్ల పేరుతో ప్రైవేటు లేఔట్లలో రియల్‌ వ్యాపారులకు గ్రావెల్‌ తోలి కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ చర్యలు చేపట్టి రిజర్వాయర్‌న పరిరక్షించకుంటే పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామిశెట్టి మోహన్‌బాబు, కాసా శ్రీనివాసులుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM