నెల్లూరు జిల్లాలో భారీగా గంజా స్వాధీనం

by సూర్య | Wed, Jan 25, 2023, 03:13 PM

నెల్లూరు జిల్లా, వెంకటాచలంలోని స్వర్ణటోల్‌ ప్లాజా వద్ద మంగళవారం పోలీసులు 93 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సీఐ గంగాధర్‌రావు, ఎస్‌ఐ అయ్యప్ప పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా చెన్నై వైపు వెళ్తున్న రెండు కార్లను తనిఖీ చేయగా 93 కేజీల గంజాయి దొరికింది. గంజాయి తరలిస్తున్న నలుగురిలో ఒకరు తప్పించుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఏపీ39జేహెచ్‌2222 నెంబరు గల కారు డ్రైవర్‌ బిక్కి నరేంద్ర బాబు తప్పించుకోగా, విజయవాడలోని పడమటి లంకకు చెందిన బొమ్మిశెట్టి హరిహారతేజ, బెంగళూరులోని విద్యారాణ్యపురాకు చెందిన కే హరిష్‌, నైజీరియా దేశానికి డోనాటస్‌ లారెన్స్‌లను పట్టుకున్నట్లు తెలిపారు. బిక్కి నరేంద్ర బాబు ద్వారా గంజాయిని విజయవాడ నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో పట్టుబడిన ముగ్గురు వెల్లడించినట్లు సీఐ గంగాధర్‌ రావు తెలిపారు. ముగ్గురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM