by సూర్య | Wed, Jan 25, 2023, 03:08 PM
తూర్పు గోదావరి జిల్లా బీజేపీ కోర్ కమిటీ సమావేశం బుధవారం రాజమహేంద్రవరంలోని హోటల్ లాహాస్పిన్లో మొదలైనది. సమావేశానికి కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి దేవుసింహ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఉదయం 8.30 గంటలకు కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. అనంతరం 9.30 గంటలకు హోటల్ రివర్బేలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికీ కేంద్ర సహాయమంత్రి హాజరవుతారు. తర్వాత కడియం, రాజమహేంద్రవరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బుధ, గురువారాల్లో జిల్లా పార్లమెంట్ పరిధిలో ఆయన పర్యటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
Latest News