సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసిపిలోకి 98 కుటుంబాలు చేరిక

by సూర్య | Thu, Nov 24, 2022, 12:00 PM

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని పెదగూడ సచివాలయం పరిధిలో బుధవారం ఎమ్మెల్యే చెట్టి. ఫాల్గుణ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెదగూడ సచివాలయం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే ఫాల్గుణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలోకి చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి. సుభద్ర ఎంపీపీ అరిసెల. సీతమ్మ వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
విద్యార్థి సంఘాల నిరసన ర్యాలీ Tue, Apr 16, 2024, 06:06 PM
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన Tue, Apr 16, 2024, 06:03 PM
104 సేవలను వినియోగించుకోవాలి Tue, Apr 16, 2024, 05:43 PM
ఆరుగురు వాలంటరీలు రాజీనామా Tue, Apr 16, 2024, 05:38 PM
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మూడు చలివేంద్రాలు ఏర్పాటు Tue, Apr 16, 2024, 05:36 PM