by సూర్య | Thu, Nov 24, 2022, 10:46 AM
ఏపీలో ట్రాన్స్ జెండర్ల రక్షణ సెల్ ను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీఐడీ విభాగం ఆధ్వర్యంలో సెల్ ప్రారంభించారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత ఈ సెల్ కు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. త్వరలోనే ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ రక్షణ సెల్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో 3,800 మంది ఓటు హక్కు ఉన్న ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.
Latest News