పాత్రికేయుల సంక్షేమానికి ప్రత్యేక మీది కేటాయించాలి

by సూర్య | Thu, Nov 24, 2022, 10:17 AM

ప్రెస్ అకాడమీని బలోపేతం చేసి, పాత్రికేయుల సంక్షేమానికి ప్రత్యేక నిధి కేటాయించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సోషల్ మీడియాతో ఎన్నో అనర్ధాలు ఉన్నాయని, వాటి నియంత్రణకై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలను తక్షణమే పునరుద్ధరణ చేయాలని, సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన మీడియా ప్రతినిధులకు తహిసీల్ధార్ స్థాయిలో ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, వీటిని నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Latest News

 
క్షీణిస్తున్న భూమా అఖిల ప్రియా ఆరోగ్యం Fri, Sep 22, 2023, 09:53 PM
చంద్రబాబును విడుదల చేయాలంటూ కొనసాగుతున్న ఆందోళనలు... దీక్షలు Fri, Sep 22, 2023, 09:36 PM
ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది...రామ్ గోపాల్ వర్మ Fri, Sep 22, 2023, 09:36 PM
ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త,,,,ఈ నెల 29న అకౌంట్‌లలో డబ్బులు Fri, Sep 22, 2023, 08:05 PM
ఇకపై సభలోకి మొబైల్స్‌కు నో పర్మిషన్,,,ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం Fri, Sep 22, 2023, 08:01 PM