మునగ సాగుతో అధిక దిగుబడులు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:12 AM

మునగ సాగుతో అధిక దిగుబడులు సాధించి ఆర్థిక పరిపుష్టిత సాధించ వచ్చునని సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి వి. సతీష్ బాబు అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కోటబొమ్మాలి మండలం, బ్రేకులు పాడు గ్రామంలో పల్లి ధర్మారావుకి చెందిన మునగ తోటను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సాగు విధానము వాటి స్థితిగతులను రైతు ధర్మారావుని అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులు ఒకే పంటని వేయకుండా ఇటువంటి లాభదాయకమైన తోటలను పెంచుకొని అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన వెంట క్వాలిటీ కంట్రోల్ జే ఈ లు ఎన్. శ్రీహరి, సుధాకర్, సాంకేతిక సహాయకులు ఎన్. గోపాలకృష్ణ ఉన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM