మోసం, వెన్నుపోటు పొడిచేవారికి మరోఛాన్స్‌ ఎవరైనా ఇస్తారా?

by సూర్య | Thu, Nov 24, 2022, 08:27 AM

బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని సీఎం వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం వైయ‌స్ జగన్‌ కోరారు.  రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్‌ పోవాలని  వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా?..మీ సేవలు వద్దు బాబూ అంటూ బైబై చెప్పి ఇంటికి పంపాలా అని ఆలోచన చేయాలని సూచించారు. మోసం, వెన్నుపోటు పొడిచేవారికి మరోఛాన్స్‌ ఎవరైనా ఇస్తారా? అన్నారు. 

Latest News

 
పార్టీ ముఖ్య నేతలతో లోకేష్ సమీక్ష Sun, Sep 24, 2023, 03:02 PM
రైళ్లపై రాళ్లు రువ్వడం నేరం Sun, Sep 24, 2023, 02:07 PM
కెనడాలో భారతీయ విద్యార్థులు.. పేరెంట్స్ ఆందోళన Sun, Sep 24, 2023, 01:48 PM
తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ Sun, Sep 24, 2023, 12:27 PM
అంబేద్కర్ విగ్రహానికి ఏపీఎస్టీఎఫ్ వినతి Sun, Sep 24, 2023, 12:16 PM