మైనార్టీలను చంద్రబాబు ద్వితీయశ్రేణి పౌరులుగానే చూసారు

by సూర్య | Thu, Nov 24, 2022, 08:26 AM

ముస్లిం మైనార్టీలను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా అన్నారు. మైనార్టీలను చంద్రబాబు ద్వితీయశ్రేణి పౌరులుగానే చూశారన్నారు. తన ఐదేళ్ల పరిపాలన కాలంలో మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించని చంద్రబాబు.. మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయని మైనార్టీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్రకటన చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. మైనార్టీలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదర సోదరీమణులందరికీ తెలుసన్నారు. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. 

Latest News

 
అది మాత్రం ఖాయం: కేశినేని నాని Thu, Apr 24, 2025, 07:30 PM
అమరావతిలో మూడు ఎలివేటెడ్ కారిడార్లు Thu, Apr 24, 2025, 07:26 PM
కశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు తలెత్తిందని ఆగ్రహం Thu, Apr 24, 2025, 07:25 PM
మరోసారి ఢిల్లీకి చంద్రబాబు.. ,,,ఈసారి సతీసమేతంగా Thu, Apr 24, 2025, 07:22 PM
వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రానికి ప్రధాని మోదీ,,, అమరావతి సభలో Thu, Apr 24, 2025, 07:18 PM