విజయవాడలో కేసీఆర్ హోర్డింగ్ లు మళ్లీ వెలిశాయి

by సూర్య | Wed, Oct 05, 2022, 11:21 PM

గతంలో కేసీఆర్ ఏపీ రాక సందర్భంగా విజయవాడలో ఆయన ఫోటో హోర్డింగ్ లు వెలిసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు  నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఆయనకు అనుకూలంగా హోర్డింగ్ లు వెలిశాయి. ఈ మేరకు కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా విస్తరిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విజయవాడలోని వారధి ప్రాంతంలో హోర్డింగులు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్‌ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్ ఏర్పాటయ్యింది. ఏపీలో బీఆర్ఎస్ హోర్డింగులు ఏర్పాటు కావడంతో వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.


హోర్డింగ్పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్తో పాటు విజయవాడ నగరంలోని వేర్వేరు చోట్ల పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి. ఇదిలావుంటే తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన కేసీఆర్.. ఇక ఢిల్లీ రాజకీయాల్లోనూ చక్రం తిప్పే దిశగా పార్టీని విస్తరిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఇకపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సన్నద్ధమైంది. ఇక, బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ బుధవారం ప్రెస్మీట్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM