by సూర్య | Wed, Oct 05, 2022, 11:20 PM
సోషల్ మీడియా పరిచయాలు వినాశనానికి దారితీస్తున్నాయని తెలియజేసే ఘటన ఇది. శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులు తట్టుకోలేక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది. సెల్ఫీ విడియో తీసి ప్రాణాలు తీసుకుంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబల్లిలో ఘటన జరిగింది. టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ మైనర్ బాలికను ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక ఆరోపించింది. బాలిక ఇంటర్ చదువుతోంది.. టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Latest News