by సూర్య | Tue, Oct 04, 2022, 11:35 AM
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో జరిగిన డాగ్ షోలో సతీష్ అనే వ్యక్తికి చెందిన 'భీమా' అనే పెంపుడు శునకం హైలైట్ గా నిలిచింది. ఈ శునకం ధర రూ.10 కోట్లు. 'టిబెటన్ మస్తఫ్' జాతికి చెందిన ఈ శునకాన్ని చైనా నుంచి తీసుకొచ్చారు. దీనిని రోజంతా ఏసీలోనే ఉంచుతామని, శునకం కోసం నెలకు రూ.25 వేలు ఖర్చవుతోందని సతీష్ తెలిపారు. దీని బరువు 100 కేజీల కంటే ఎక్కువేనని, రోజుకు ఒక కి.మీ దూరం మాత్రమే నడుస్తుందని చెప్పారు.
Latest News