by సూర్య | Tue, Oct 04, 2022, 11:29 AM
కూడేరు మండలం గొట్కూరు గ్రామంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి యువరైతు కరుణాకర్ (25) మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పొలంలోకి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా చీకటిలో కనపడని తెగిపడిన 11 కేవి విద్యుత్తు వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కరుణాకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Latest News