by సూర్య | Tue, Oct 04, 2022, 11:28 AM
ఈనెల 5వ తేదీ బుధవారం ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పుట్టపర్తికి రానున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సత్యసాయి విమానాశ్రయానికి 11. 10 నిమిషాలకు విచ్చేస్తారని, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు ప్రశాంతి నిలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్ తిరిగి విజయవాడ వెళ్తారని వివరించారు.
Latest News