by సూర్య | Mon, Oct 03, 2022, 05:14 PM
విష సర్పం కాటేయడంతో ఓ మహిళ పరిస్థితి విషమించిన సంఘటన సోమవారం మదనపల్లి మండలంలో జరిగింది. ఘటనకు సంబంధించి బాధితురాలు కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలం వలసపల్లిలో కాపురం ఉంటున్న కనుమప్ప భార్య కదిరమ్మ(41) దసరా పండుగ కోసం ఇంటిని శుభ్రం చేస్తుండగా ఇంటి రంద్రంలో పొంచి ఉన్న ఓ విష సర్పం కదిరమ్మ చేతిపై కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని కుటుంబ సభ్యులు స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రిఫర్ చేశారు.
Latest News