by సూర్య | Fri, Sep 23, 2022, 05:00 PM
సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడటంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నాయని సౌదీ అరేబియా అధికారికంగా వెల్లడించింది. మదీనా ప్రాంతంలోని అబా అల్ రహా వద్ద బంగారం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు సౌదీ జియోలాజికల్ సర్వే తెలిపింది. వీటి ద్వారా సౌదీకి 533 మిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
Latest News