by సూర్య | Fri, Sep 23, 2022, 04:48 PM
హెల్త్ యూనివర్సిటీకి పేరు మారిస్తే తెలుగుదేశం నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలకి సమస్యలను సృష్టించి ప్రతిదానికీ నానా యాగీ చేయడం అలవాటు అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గొడవలు చేసి సస్పెన్షన్ చేయించుకుని బయటకి వెళ్లిపోతారన్నారు. శాసనసభ, శాసనమండలిలో ప్రజాసమస్యలను చర్చించేందుకు టీడీపీ నేతలు ముందుకు రారని చెప్పారు.వ్యవసాయ శాఖపై చర్చ పెడితే, లోకేష్ వ్యక్తిగత విమర్శలకి దిగే ప్రయత్నం చేశారని, సబ్జెక్టు లేదు కాబట్టే వ్యక్తిగత విమర్శలు, దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే ఎన్టీఆర్ని ఎన్నివిధాలా ఇబ్బందులు పెట్టారో చెప్పాలన్నారు.
Latest News