నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20

by సూర్య | Fri, Sep 23, 2022, 11:47 AM

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది కాబట్టి.. నాగ్‌పూర్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లోకి తిరిగి రావాలని భారత్ భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన ఆసీస్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. 


రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పుర్ వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ సాయత్రం 6.30 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌ యాప్‌లలో లైవ్ స్ట్రీమింగ్‌ కానుంది. ఇక శుక్రవారం నాగ్‌పూర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. తేమ 78 శాతం ఉంటుందని అంచనా. టాస్‌పై మంచు ప్రభావం చూపించొచ్చని తెలుస్తోంది. ముందుగా బౌలింగ్ చేసిన జట్టుకు లాభించనుంది. 


నాగ్‌పూర్‌లో భారత్ మొత్తం 4 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌లు గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. శ్రీలంక, న్యూజిలాండ్‌ల చేతిలో టీమిండియా ఓడిపోయింది. 2019లో నాగ్‌పూర్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ చివరి టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, రవిచంద్రన్ అశ్విన్.

Latest News

 
పిఠాపురంలో జనసేనానికి జన నీరాజనం Fri, May 10, 2024, 10:33 PM
ఏపీలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయంటే.. అక్కడే అత్యధికం.. ఎవరికి ప్లస్? Fri, May 10, 2024, 10:06 PM
రేపు పిఠాపురం వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల సురేఖ Fri, May 10, 2024, 09:55 PM
లారీలో సీక్రెట్‌గా దొరక్కుండా దాచేసి.. ఏం తెలివిరా నాయనా.. ప్లాన్ మొత్తం రివర్స్ Fri, May 10, 2024, 09:09 PM
సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ Fri, May 10, 2024, 09:05 PM