వారికి ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే అర్హత లేదు: టీడీపీ నేత పట్టాభి

by సూర్య | Thu, Sep 22, 2022, 08:10 PM

హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జగన్ దుర్మార్గాన్ని ప్రశ్నించలేని వారికి ఎన్టీఆర్ పేరును కూడా ఉచ్చరించే అర్హత లేదని  టీడీపీ నేత పట్టాభి చెప్పారు. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై కొడాలి నాని, వల్లభనేని వంశీలకు తాడేపల్లి ప్యాలస్ ముందు ధర్నా చేసే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెడతామని అన్నారు. 


అసలు రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం దారుణమని చెప్పారు. రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఏ2 విజయసాయిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని... వీటిలో చంద్రబాబు హయాంలో 4 మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. జగన్ మాత్రం 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయంటూ అబద్ధాలు చెపుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరును మార్చుతూ అసెంబ్లీలో బిల్లును తీసుకురావడం రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజు అని అన్నారు. కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్ అందించలేక 110 మంది ప్రాణాలను బలితీసుకున్న జగన్ కు ఆరోగ్యం గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM