వైసీపీ నిర్ణయంపై అన్ని వైపుల నుంచి నిరసన

by సూర్య | Thu, Sep 22, 2022, 08:08 PM

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి, వైఎస్సార్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టడంపై వైసీపీ మినహా అన్ని పార్టీలు  ముక్తకంఠంతో విమర్శిస్తున్నాయి. దీనిపై నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూనివర్శిటీని స్థాపించిందే ఎన్టీఆర్ అయినప్పుడు... ఆయన పేరును ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. 


ఈ మేరకు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ పేరిట నందమూరి కుటుంబం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇదొక దురదృష్టకరమైన పరిణామమని ప్రకటనలో వారు పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని నలుదిక్కులా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని వారు చెప్పారు. అన్ని కులాలు, మతాలు, పార్టీలకు చెందిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. అలాంటి ఒక యుగపురుషుడి పేరును మార్చడం.. ముమ్మాటికీ తెలుగు జాతిని అవమానించినట్టేనని చెప్పారు.


మరోవైపు, ఎన్టీఆర్ పేరును తొలగించడంపై పార్టీలకు అతీతంగా అన్ని విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ శ్రేణులు పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటని ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM