by సూర్య | Thu, Sep 22, 2022, 05:45 PM
ఏపీకి 3 నెలల్లో 3వేల కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి నీతి గడ్కరీ అన్నారు. ప్రభుత్వం ముందుకొస్తే లాజిస్టిక్ పార్క్, విజయవాడ బైపాస్ మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రాజమండ్రిలో హైవే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 2024 నాటికి ఈ హైవే పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ హైవే 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకవరం వద్ద నాలుగు లైన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు.