by సూర్య | Thu, Sep 22, 2022, 05:50 PM
ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఏపీయస్ఆర్టీసి సిద్ధమైంది. 'స్టార్ లైనర్' పేరిట 62 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను.. ఈ దసరా నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రయోగాత్మకంగా ఈ సర్వీసులు నడుపుతున్నామని.. మంచి ఫలితాలు వస్తే వీటిని కొనసాగిస్తామని సంస్థ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. అటు దసరాకు 4,100 పత్యేక బస్సులను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా నడుపుతున్నట్లు ప్రకటించారు.
Latest News