ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు

byసూర్య | Fri, Apr 26, 2024, 07:27 PM

హైదరాబాద్ శివారులోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని అలెన్ హోమియో అండ్ హెర్బల్ ప్రొడక్ట్ కంపెనీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటులు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులు ఉండగా.. ప్రాణ భయంలో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది.


పొగ తట్టుకోలేక కొంత మంది కార్మికులు బిల్డింగ్ మీది నుంచి కిందికి దూకారు. దీంతో.. ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు.. కంపెనీ లోపలి నుంచి తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన 5 ఫైర్ ఇంజన్లు.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా.. అక్కడి వాతావరణమంతా దట్టమైన పొగ అలుముకోవటంతో సహాయక చర్యలకు ఇబ్బంది అవుతోంది. అయితే.. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM