కేంద్ర బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Sun, Oct 20, 2024, 08:14 PM

కేంద్ర బీమా పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఏపీజీవీబీ జగదేవపూర్ మేనేజర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో లీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం, జీవనజ్యోతి యోజన పథకం, అటల్ పెన్షన్ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బీమా పథకాలు కుటుంబానికి కొండంత ధీమానిస్తాయని వివరించారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ భీమా సౌకర్యం ఉంటుందని వివరించారు. గ్రామాల్లో బీమా పథకాలను కట్టుకునేవారు బ్యాంకు మిత్రలను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది నర్సింలు, సురేందర్, కనక లక్ష్మీ, శకుంతల, యాదగిరి తదితరులు పాల్గొన్నారు...


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM