byసూర్య | Wed, Oct 16, 2024, 07:52 PM
తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతి చెందినవారిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఓ పురుషుడు ఉన్నారు. మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద ఈరోజు సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.మృతులను పాముబండ తండాకు చెందిన వారిగా గుర్తించారు. రోడ్డుపై గుంతలు ఉండటంతో వేగంగా వెళుతున్న కారు కల్వర్టును ఢీకొట్టింది. కారు ఎగిరి పక్కనే ఉన్న కాల్వలో పడింది. దాంతో కారులో ఉన్న వారు నీట మునిగి చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.