మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ ఆరోపణలు

byసూర్య | Tue, Oct 15, 2024, 09:04 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తూ బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్ల రూపాయల కుంభకోణమని, అందులో రూ.25 వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఆమె ఫిర్యాదు చేశారు.ఆత్రం సుగుణ 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ చేతిలో 90 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.


Latest News
 

షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం Sun, Oct 27, 2024, 12:38 PM
జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్ Sun, Oct 27, 2024, 12:29 PM
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర Sun, Oct 27, 2024, 12:05 PM
దీపావళి పండుగ.. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు Sun, Oct 27, 2024, 11:55 AM
సూర్యలంక సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతు.. Sun, Oct 27, 2024, 11:54 AM