డిజిటల్ కార్డులపై అధికారులతో సీఎం సమీక్ష

byసూర్య | Mon, Sep 30, 2024, 06:29 PM

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫొటోను తీయాలన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని సూచించారు.డిజిటల్ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్ 3 నుంచి 7 వరకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామం, ఒక పట్టణం చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలన్నారు. పైలట్ ప్రాజెక్టు అనంతరం పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


Latest News
 

రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM
సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు Mon, Sep 30, 2024, 08:55 PM
రుణమాఫీ కాని అన్నదాతల భారీ శుభవార్త.. 5 లక్షల రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ. Mon, Sep 30, 2024, 08:50 PM
చార్మినార్ కూల్చాలని చెబితే కూల్చేస్తారా..? 'హైడ్రా' కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం Mon, Sep 30, 2024, 08:17 PM