మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చొరవతో రోడ్డు పనులకు 64 లక్షలు మంజూరు

byసూర్య | Sun, Sep 22, 2024, 06:39 PM

గాజుల రామారం 125 డివిజన్ ఉషోదయ కాలనీలో వాటర్ వర్క్స్ సిబ్బంది అండర్ డ్రైనేజి లైన్ వేయడంతో అక్కడి మెయిన్ రోడ్ ను తవ్వి వదిలేశారు. దీనితో స్థానికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది. ఈ విషయాన్ని ఉషోదయ కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ప్రభుత్వం తరపున సిసి రోడ్ నిర్మాణానికి 64 లక్షలు మంజూరు చేయించారు.
ప్రస్తుత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సమస్యలను పట్టించుకోకుండా, పాలనను గాలికి వదిలేశారని, కాలనీ వాసులు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చొరవతో 64 లక్షలు మంజూరు కావడం పట్ల కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ కాలనీ ప్రధాన కార్యదర్శి సతీష్ బాబు, కాలనీ ప్రజలు వెంకటరెడ్డి, టీవీ శ్రీను, మల్లారెడ్డి, బాల్ రెడ్డి, గురుప్రసాద్, రషీద్ బేగ్, లాల్ మాము, కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, విజయ్ కుమార్, ఎల్లా గౌడ్, రవీందర్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM