byసూర్య | Thu, Jul 11, 2024, 10:24 AM
జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సతీమణి జ్యోతి, కుమారుడు సాయి సాకేత్ రెడ్డి లు గురువారం తెల్లవారుజామున శ్రీశ్రీశ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులను పొందారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడి, పాడిపంటలతో, అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.