byసూర్య | Wed, Jun 26, 2024, 11:28 AM
జేష్ఠ మాసం పంచమి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం శివలింగానికి అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. స్వామివారికి మంగళ హారతులు , మహా నైవేద్యాన్ని సమర్పించారు.