byసూర్య | Tue, Jun 25, 2024, 08:24 PM
మహిళలు, ఆడపిల్లల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వావివరసలు మరిచిపోయి కొందరు ఆడపిల్లలను వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నేరెడ్మెట్లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన బాలికను ఐదుగురు యువకులు ట్రాప్ చేసారు. బాలికకు గంజాయి అలవాటు చేసి నేరెడ్మెట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలిక గంజాయి మత్తులో ఉండగానే ఐదుగురు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి యువకులు పరారయ్యారు. మత్తు నుంచి తేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని ఇంటికొచ్చిన తర్వాత తల్లికి చెప్పింది.
దీంతో బాలిత తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. నేరెడ్మెట్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రేప్ కేసు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.