byసూర్య | Tue, May 07, 2024, 10:48 AM
మెదక్ నియోజకవర్గంలో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. హవేలి ఘనపూర్ మండలంలోని బూరుగుపల్లిలో సోమవారం నిర్వహించారు. హవేలి ఘనపూర్ నుంచి బూరుగుపల్లి వరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ ఆధ్వర్యంలో భారీ వాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ మైనంపల్లి రోహిత్ ద్విచక్ర వాహనంపై ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కూర్చోని ప్రచారం చేశారు.