byసూర్య | Mon, May 06, 2024, 01:22 PM
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల రాకతో సందడిగా మారింది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఈ సందర్బంగా భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.