byసూర్య | Mon, May 06, 2024, 12:17 PM
మహిళలు చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఓబిసి సెల్ చైర్మన్ రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఓబీసీ ఐక్యత సమ్మేళనం నిర్వహించారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.