byసూర్య | Mon, May 06, 2024, 12:16 PM
వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి. సోమవారం భద్రాచలంలో బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ. 280, స్కిన్లెస్ రూ. 300లకు చేరుకుంది. సాధారణ రోజుల్లోనే చికెన్ దుకాణాల వద్ద వరుస కట్టే మాంసాహార ప్రియులు ధరల పెరుగుదల కారణంగా వారాంతంలోనూ వాటి వద్ద పెద్దగా కనిపించడం లేదు. కొనలేమని వినియోగదారులు, అమ్మకాలు తగ్గాయని దుకాణదారులు వాపోతున్నారు.