డీకే అరుణను గెలిపిస్తే విమానంలో అక్కడికి తీసుకెళ్తా'.. కార్యకర్తలకు బీజేపీ నేత బంపరాఫర్

byసూర్య | Sun, May 05, 2024, 07:43 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ.. ఓటర్ల చుట్టూ తిరుగుతున్నారు. తమను గెలిపిస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీల వర్షం గుప్పిస్తున్నారు. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.


ఇక అభ్యర్థులతో పాటు పార్టీ కీలక నేతలు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తమ పార్టీ నేతను గెలిపిస్తే ఎన్నికల తర్వాత తీర్థయాత్రలు, ట్రిప్పులకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నారు. తాజాగా.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు బంపరాఫర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్న అరుణమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె గెలుపే లక్ష్యంగా ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్త పనిచేయాలని సూచించారు.


ఎంపీ ఎన్నికల్లో అరుణమ్మ గెలిచాక మక్తల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల అధ్యక్షులను, బూత్ అధ్యక్షులను విమానంలో అయోధ్యకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తన సొంత ఖర్చులతో నాయకులందరినీ అయోధ్యకు విమానంలో తీసుకెళ్లి రామయ్య దర్శనం చేయిస్తానని లక్ష్మీకాంత్ రెడ్డి వారికి ఆఫర్ ప్రకటించారు. ఈ వారం రోజులు ప్రతి కార్యకర్త, నాయకుడు అవిశ్రాంతంగా కృషి చేయాలని మహబూబ్‌నగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన ఆఫర్‌కు నాయకులు, కార్యకర్తలు ఖుషీ అవుతున్నారు. డీకే అరుణ గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM