హైదరాబాద్-విజయవాడ వెళ్లే బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపరాఫ

byసూర్య | Mon, Apr 29, 2024, 08:05 PM

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల ఫీవర్ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఉపాధి నిమిత్తం స్థిరపడినవారు చాలా మంది ఏపీలోని సొంతూళ్లకు వెళ్తున్నారు. వేసవి సెలవులు, ఓట్ల పండగ నేపథ్యంలో స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సు ప్రయాణాలు సాగించేవారికి ఆర్టీసీ  బంపరాఫర్ ప్రకటించింది.


హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రతి 10 నిమిషాలకు ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోందని సజ్జనార్ ట్వీట్ చేశారు. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయన్నారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం డిస్కౌంట్‌ను కల్పిస్తున్నట్లు చెప్పారు. తిరుగు ప్రయాణ టికెట్‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని అన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని సజ్జనార్ ట్వీట్ చేశారు.


వేసవి ప్రత్యేక ట్రైన్లు..


వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే నడుస్తున్న ట్రైన్లకు అదనంగా తిరుపతి- శ్రీకాకుళం, కాచిగూడ- కాకినాడ, హైదరాబాద్‌- నరసాపురం మధ్య మరిన్ని స్పెషల్ ట్రైన్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయన్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM