త్వరలోనే కేటీఆర్ బండారమంతా బయటపెడతా.. బండి సంజయ్

byసూర్య | Mon, Apr 29, 2024, 07:34 PM

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. రాజకీయ నేతల మధ్య మాటల తుటాలు బలంగా పేలుతున్నాయి. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై.. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే కేటీఆర్ బండారమంతా బయటపెడతానని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ అక్రమాస్తుల చిట్టా మొత్తం తన దగ్గర ఉందని.. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయంటూ బాంబు పేల్చారు. కేటీఆర్ అక్రమ ఆస్తులపై కచ్చితంగా విచారణ జరుపుతామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.


ఇక.. జూన్ 2 తర్వాత హైదరాబాద్‌ను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా తీసేసి.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుందని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ మద్య ఒప్పందం కూడా కుదిరిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కాగా.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్... అసలు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఉద్దేశం బీజేపీకి ఏమాత్రం లేదంటూ కేటీఆర్ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM