byసూర్య | Mon, Apr 29, 2024, 12:43 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, లింగాల మండలం పరిధిలోని కాంసాన్ పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన యాదవుల బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి, సిబిఎం ట్రస్ట్ చైర్మన్, అమ్రాబాద్ జడ్పిటిసి డాక్టర్ చిక్కుడు అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ బోనం ఎత్తి, నైవేద్యాన్ని సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.