byసూర్య | Mon, Apr 29, 2024, 12:39 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవరం ఐనోల్ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి, మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ అధికారిగా పనిచేసిన కాలంలో ఎంతోమందిని ఎన్ కౌంటర్ల పేరుతో చంపివేశాడని అన్నారు.